ఇటీవల ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెలంగాణ మంత్రి కొండా సురేఖ భర్త, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. వీటిపై పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఆయన శనివారం గాంధీ భవన్లో పీసీసీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు.
మరవైపు, తెలంగాణ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి మాట్లాడుతూ, మేము నోటీసు ఇస్తే కొండా మురళి వచ్చారు. ఆయన మాకు వివరణ ఇచ్చారు. రాతపూర్వకంగా కూడా వివరణ ఇచ్చారు అని తెలిపారు.