రైలు పట్టాలపై కారు నడిపిన యువతి మెంటల్ ఆస్పత్రికి తరలింపు (Video)

ఠాగూర్

శనివారం, 28 జూన్ 2025 (12:47 IST)
తెలంగాణ రాష్ట్రంలోని శంకర్‌పల్లిలో రైలు పట్టాలపై కారు నడిపిన యువతిని పోలీసులు అరెస్టు చేసి హైదరాబాద్ ఎర్రగడ్డలోని మెంటల్ ఆస్పత్రికి తరలించారు. అదుపులోకి తీసుకునే సమయంలో పోలీసులపై ఆ యువతి దాడి చేసింది. దీంతో ఆమె శంకర్‌పల్లి రైల్వే పోలీస్ స్టేషన్‌లో కేసు కేసు నమోదుచేశారు. ఆమెకు చికిత్స తర్వాత పోలీసులు విచారణ జరుపనున్నారు. 
 
కాగా, రీల్స్ మోజులో ఆ యువతి రైలు పట్టాలపై కారు నడిపింది. నిందితురాలిని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో టెక్కీగా పని చేస్తున్నట్టు సమాచారం. పేరు రవికా సోని. లక్నోకు చెందిన యువతిగా గుర్తించారు. ఆమెను ఇటీవల కంపెనీ యాజమాన్యం విధుల నుంచి తొలగించారు. యువతి మతిస్థితిమితం కోల్పోయిందా లేదా మత్తుపదార్థాలు ఏమైనా తీసుకుందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

 

శంకర్‌పల్లిలో రైలు పట్టాలపై కారు నడిపిన యువతి రవికా సోనిని ఎర్రగడ్డ మెంటల్ ఆస్పత్రికి తరలింపు

అదుపులోకి తీసుకున్న సమయంలో పోలీసులపై దాడి చేసిన యువతి

శంకర్‌పల్లి, రైల్వే పీఎస్‌లో యువతిపై కేసు నమోదు

చికిత్స తర్వాత విచారణకు హాజరుకావాలన్న పోలీసులు https://t.co/cfzQLeRMyp pic.twitter.com/d8B3HIW6CF

— Telugu Scribe (@TeluguScribe) June 28, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు