సంక్లిష్టమైన నయీమ్ కథను ఒక్క భాగంలో చూపించడం అసాధ్యమని.. అందుకే మూడు భాగాలుగా సినిమా తీస్తున్నట్లు తెలిపాడు. నయీమ్కు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సేకరించానని, ఇన్నేళ్లుగా అతడు చేసిన నేరాలలో వెంట్రుకలు నిక్కబొడుచుకునే ఘటనలు చాలా ఉన్నాయని వెల్లడించాడు.
తరచూ వివాదాస్పద ట్వీట్లతో వార్తల్లో నిలిచే రామ్గోపాల్ వర్మ తాజాగా భారత్పై దండెత్తాడు. దేశంలోని క్రీడాభిమానులంతా రియో ఒలంపిక్స్లో భారత్కు సిల్వర్ మెడల్ వచ్చిన ఆనందంలో ఉంటే... వర్మ వారి సంతోషంపై నిప్పులు చల్లాడు. ‘ఒక్క రజతపతకం సాధించినందుకే మేరా భారత్మహాన్ అని మురిసిపోతున్నారే... 46 గోల్డ్, 37 సిల్వర్ పతకాలు సాధించిన అమెరికా ఎంత గర్వపడాలి?, 9 బంగారు పతకాలు సాధించిన సౌత్ కొరియా ఇంకెత ఫీల్ అవ్వాలి?’ అంటూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.