నేను రాజకుమారిని అంటున్న నటి... ఆ హోటల్ గదిలో అలా జరిగిపోయింది...

బుధవారం, 23 నవంబరు 2016 (20:18 IST)
నటి శ్వేతాబసు తాను రాజకుమారిని అని చెబుతోంది. అదెలాగంటే.. తనను అందరూ నెగెటివ్‌ కోణంలో చూశారు. కొత్తబంగారు లోకం సినిమాలో ఎంతగా ఆదరించారో.. ఆ తర్వాత జరిగిన కొన్ని సంఘటనల వల్ల కెరీర్‌ నాశనమైంది. ఓ వారపత్రిక నిర్వహించే అవార్డు కార్యక్రమానికి రమ్మంటే వచ్చాను. వారు ఏర్పాటు చేసిన హోటల్‌లో దిగాను. కానీ తర్వాత ఏం జరిగిందో కానీ.. నన్ను పోలీసులు అరెస్ట్‌ చేసి రైడ్‌ చేశామని.. బ్రోతల్‌గా క్రియేట్‌ చేశారు. ఇదంతా పెద్ద పీడకలగా చెబుతోంది. 
 
అసలు ఆ రోజు రాత్రి ఏమి జరిగిందనేది చెబుతూ.. ప్రోగ్రాం అయిన తర్వాత ముంబైకు వెళ్ళాల్సింది. కానీ ఎక్కాల్సిన విమానం కాన్సిల్‌ కావడంతో తిరిగి అదే రూమ్‌కు వచ్చాను. కాసేపటికి.. పోలీసులు నేనున్న రూమ్‌కు రైడ్‌ కోసం వచ్చారు. అసలు ఏం జరుగుతుందో తెలిసుకునే లోపలే అంతా జరిగిపోయిందంటూ.. వివరించింది. ఇప్పటికే ఈ విషయాన్ని చెప్పినా ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె అక్కడి మీడియాకు తెలిపింది. 
 
ఏక్తాకపూర్‌ నిర్మాతగా వుంటున్న మెగా సీరియల్‌ చంద్రనందినిలో రాజకుమారి పాత్ర చేస్తున్నానని చెప్పింది. ఈ సీరియల్‌తో రాజకుమారిగా పాపులర్ అవుతానని.. ఈ క్రెడిట్‌ ఏక్తాకు దక్కుతుందని... ఏక్తా.. డేరింగ్‌ డాషింగ్‌ నిర్మాత దర్శఖురాలని కితాబిస్తోంది.

వెబ్దునియా పై చదవండి