కొవ్వూరు ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల దీక్ష భగ్నం

కొవ్వూరు ఎమ్మెల్యే టీవీ రామారావుపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలంటూ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన ఆయన కుటుంబ సభ్యుల దీక్షను పోలీసులు భగ్నం చేశారు. రామారావు కుటుంబసభ్యుల ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోందని వైద్యులు నిర్ధారించడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి వారి దీక్షను భగ్నం చేశారు.

అనంతరం అందరిని బలవంతంగా యశోద ఆస్పత్రికి చికిత్స నిమిత్రం తరలించారు. రామారావు కుటుంబ సభ్యులు త్వరలోనే కోలుకుంటారని వైద్యులు తెలిపారు. రామారావుపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలంటూ గత నాలుగు రోజులుగా ఇందిరాపార్కు వద్ద రామారావు కుటుంబ సభ్యులు నిరసన చేపడుతున్న సంగతి తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి