రాజీనామాలపై ఏకపక్ష నిర్ణయాలు తీసుకోను: స్పీకర్

FILE
తెలంగాణ ప్రజాప్రతినిధుల రాజీనామాలపై ఏకపక్ష నిర్ణయాలు తీసుకోననని సభాపతి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాజీనామాలు చేసిన వారందరితోనూ మాట్లాడిన తర్వాతే నిర్ణయముంటుందన్నారు. ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.

శాసనసభ్యుల గౌరవాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పీకర్ చెప్పారు. న్యాయ, రాజ్యాంగ నిపుణులతో చర్చించి, రాష్ట్ర పరిస్థితులపై పూర్తి సమాచారం తెప్పించుకుంటానన్నారు.

ఈ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోనని, అలాంటి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదని న్యూఢిల్లీ స్పీకర్ విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. రాజీనామాలపై ఏం నిర్ణయం తీసుకుంటానో 13న హైదరాబాద్ వచ్చిన తర్వాతే చెప్పగలనని స్పీకర్ వ్యాఖ్యానించారు.

వెబ్దునియా పై చదవండి