పెళ్లి వేడుకలో ఆహారం కలుషితం-17మందికి అస్వస్థత

ఆదివారం, 21 ఆగస్టు 2022 (12:24 IST)
పెళ్లి వేడుకలో ఆహారం కలుషితం అయ్యింది. ఆహారం తీసుకున్న 17 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన కోనసీమ జిల్లాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. కోనసీమ జిల్లా మండపేటలో ఓ వివాహ వేడుకలో భాగంగా ఆహారం తీసుకున్న కొద్ది సేపటికే 17మంది అస్వస్థతకు గురైయ్యారు. 
 
వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.  అయితే వివాహ వేడుకలో జరిగిన ఫుడ్ పాయిజనింగ్‌కు సరైన కారణాలేమీ ఇంకా తెలిసి రాలేదు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు