సాగర్ కాల్వలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు... ఏడుగురి మృతి

మంగళవారం, 11 జులై 2023 (08:44 IST)
ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏపీఎస్ ఆర్టీసీకి చెందిన బస్సు ఒకటి నాగార్జున సాగర్ కుడి కాలువలో బోల్తాపడింది. ప్రకాశం జిల్లా దర్శి సమీపంలో సాగర్ కెనాల్‌లో పెళ్లి బృందం బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృత్యువాతపడగా, మరో 12 మంది గాయపడ్డారు. ఈ బస్సు పొదిలి నుంచి కాకినాడ వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో 35 నుంచి 40 మంది వరకు ఉన్నట్టు సమాచారం. 
 
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కాకినాడలో జరిగిన ఒక వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి వెళ్లేందుకు ఈ పెళ్లి బృందం ఆర్టీసీ బస్సును అద్దెకు తీసుకుంది. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిని పొదిలి గ్రామానికి చెందిన అబ్దుల్ అజీజ్ (65), అబ్దుల్ హానీ (60), షేక్ రమీజ్ (48), ముల్లా నూర్జహాన్ (58), ముల్లా జానీబేగం (65), షేక్ షబీనా (35), షేక్ హీనా (6)లుగా గుర్తించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు