చిత్తూరు జిల్లా పీలేరు మండలంలోని వేపులబైలు పంచాయతీ కంచెంవారిపల్లిలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. కంచెంవారిపల్లికి చెందిన శ్రీలక్ష్మి, భాస్కర్ లు భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు. భాస్కర్ అనారోగ్యంతో మృతి చెందాడు. అప్పటి నుంచి శ్రీలక్ష్మి దినసరి కూలి చేసుకుంటూ పిల్లలను చూసుకుంటోంది.