ఎక్కడ అవినీతి జరిగినా వెంటనే సమాచారమివ్వండి - ఎసిబి డిజి ఠాగూర్ (వీడియో)

శనివారం, 9 డిశెంబరు 2017 (19:58 IST)
అవినీతి రహిత సమాజం కోసం యువత నడుం బిగించాలని పిలుపునిచ్చారు ఎసిబి డైరెక్టర్ జనరల్ ఠాగూర్. యాంటీ కరెప్షన్ డే సందర్భంగా తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎసిబి డిజి పాల్గొన్నారు. దేశం వేగంగా అభివృద్థి చెందాలంటే అవినీతిని తరిమికొట్టడమే మొదటి మార్గమన్నారు.
 
మన చుట్టుపక్కల అవినీతికి ఎవరైనా పాల్పడ్డారని తెలిస్తే వెంటనే ఎసిబికి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఎసిబి అధికారుల పట్ల ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రజలకు మరింత అవగాహన పెంపొందించే ప్రయత్నం చేస్తామని చెప్పారాయన.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు