విజయవాడలోని దుర్గా ఘాట్ వద్ద కృష్ణా నదిలో నీటిలోకి దిగారు. రాష్ట్ర విభజనతో సగం మునిగి ఉన్న తమను ప్రత్యేక హోదా ఇవ్వకుండా చేసి నిలువునా ముంచొద్దని అన్నారు. 'మాట తప్పొద్దు... ఏపీని ముంచొద్దు' అని రాసిన ప్లకార్డును ఆయన పట్టుకున్నారు. శివాజీని చూసేందుకు అభిమానులు రావడంతో, ఈ ప్రాంతంలో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది.