కాగా, తనకు ప్రకటించిన పద్మభూషణ్ అవార్డును అందుకునేందుకు తన కుటుంబ సభ్యులతో వెళ్లిన నందమూరి బాలకృష్ణ తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో పద్మ అవార్డుల ప్రదానోత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలకృష్ణ తన కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీలోని మాన్ సింగ్ రోడ్డు నుంచి రాష్ట్రపతి భవన్కు చేరుకుని అక్కడ గ్రూపు ఫోటో దిగారు. దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అయ్యాయి.
మరోవైపు, కోలీవుడ్ అగ్ర నటుడు అజిత్ కుమార్ కూడా పద్మభూషణ్ అవార్డును అందుకున్నారు. తాను పద్మ పురస్కారానికి ఎంపికైన సమయంలో అజిత్ తీవ్ర భావోద్వేగానికి గురైన విషయం తెల్సిందే. "ఈ శుభవార్త వినేందుకు తన తండ్రి జీవించి వుంటే బాగుందనిపిస్తుంది. ఆయన గర్వపడేవారు" అని పేర్కొన్నారు.