రేణిగుంట‌లో ర‌న్ వేపై పేలిన ఎయిర్ ఇండియా విమానం టైరు...

సోమవారం, 7 నవంబరు 2016 (21:37 IST)
తిరుప‌తి: రేణిగుంట విమానాశ్రమంలో ఎయిర్ ఇండియా విమానానికి ముప్పు తప్పింది. విమానం ల్యాండింగ్ అవుతుండగా, టైర్ పేలింది. పైలట్ అప్రమత్తం కావడంతో 178 మంది ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. 
 
ఈ విమానం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ మీదుగా రేణిగుంటకు వచ్చింది. రేణిగుంట నుంచి తిరిగి హైదరాబాద్ మీదుగా ఢిల్లీ వెళ్లాల్సి ఉంది. టైర్ పేలిపోవడంలో ప్రయాణికులను తిరుపతిలోనే ఉంచారు. ప్రయాణికులను వేరే విమానం ద్వారా హైదరాబాద్‌కు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

వెబ్దునియా పై చదవండి