భార్యతో ముద్దూముచ్చట్లు.. రోకలిబండతో కొట్టి చంపిన భర్త...

మంగళవారం, 29 జనవరి 2019 (08:59 IST)
వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. రోకలి బండతో తలపై బలంగా కొట్టడంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ హత్య తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం బచ్చుతండాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ తండాకు చెందిన వాంకుతోడు వెంకన్న (40)పై అదే గ్రామానికి చెందిన లాలు అనే వ్యక్తి రోకలిబండతో దాడి చేశాడు. తన భార్యతో వెంకన్న శారీరకంగా కలిసివుండటాన్ని కళ్ళారా చూడటంతో జీర్ణించుకోలేని లాలూ.. రోకలి బండతో దాడి చేయడంతో వెంకన్న ప్రాణాలు కోల్పోయాడు. సమాచారంమందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు