ఏపీ సర్కారు ఉద్యోగులకు శుభవార్త... 5రోజుల పనిదినాలను..?

శనివారం, 27 జూన్ 2020 (16:18 IST)
ఏపీ సర్కారు ఉద్యోగులకు శుభవార్త. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు వారంలో ఐదు రోజుల పనిదినాలను ఏడాదిపాటు పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు. సచివాలయ ఉద్యోగులు, అన్ని శాఖాల హెచ్‌ఓడీ కార్యాలయ ఉద్యోగులకు ఉత్తర్వులు  వర్తిస్తాయని ఆమె పేర్కొన్నారు. 
 
ఉద్యోగుల సమస్యలన్నింటిపై సీఎం జగన్‌ సానుకూలంగా స్పందిస్తున్నారని నీలం సాహ్ని వెల్లడించారు. ఇకపోతే.. ఉద్యోగులకు మేలు చేసినందుకు ఏపీ ఉద్యోగుల సంఘం చైర్మన్‌  వెంకట్రామిరెడ్డి సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఉద్యోగులు మరింత మెరుగ్గా పనిచేసేలా ఈ ఉత్తర్వులు ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు