ఏపీలో ప్రభుత్వ కాంట్రాక్టర్ల అత్యవసర సమావేశం!

సోమవారం, 18 నవంబరు 2019 (14:16 IST)
విజయవాడ హోటల్ ఇంద్రప్రస్త హోటల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ కాంట్రాక్టర్ల అత్యవసరంగా సమావేశమయ్యారు. ఇందులో ప్రభుత్వ బిల్డింగ్ కాంట్రాక్టర్ల అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వం తక్షనమే పెండింగ్ బిల్లులు చెల్లించాలని సమావేశంలో తీర్మానం చేశారు. 
 
అవినీతి జరిగిందనే పేరుతో పనులు చేసిన కాంట్రాక్టర్లను ఇబ్బందులు పెడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పనులు పూర్తయిన వాటికి సంబంధించి కోట్లాది రూపాయలు పెండింగ్ ఉన్నాయి. అవినీతి జరిగితే చర్యలు తీసుకోవాలి తప్ప బిల్లులు నిలిపివేయకూడదు.
 
ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న మమ్మల్ని ఇబ్బందులు పెట్టడం వల్ల కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. త్వరలో సీఎంని కలిసి సమస్యను వివరిస్తాం. మేము చేసిన చేయబోయే ప్రాజెక్టులకు సంబంధించిన వాటిపై రివర్స్ టెండరింగ్‌కు వెళ్లిన మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. 500 కోట్ల రూపాయల బిల్లులను నిలిచిపోవడం వల్ల కాంట్రాక్టర్లు ఆవేదన చెందుతున్నారు. కాంట్రాక్టర్లపై ఆధారపడిన కార్మికులు రోడ్డున పడ్డారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు