తాడిపత్రి సీఐ ఆత్మహత్య.. ఏమైందో తెలుసా?

సోమవారం, 3 జులై 2023 (11:52 IST)
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన 52 ఏళ్ల సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ) ఆనందరావు సోమవారం తెల్లవారుజామున ఆత్మహత్యకు పాల్పడ్డారు.
 
వివారాల్లోకి వెళితే.. గత తొమ్మిది నెలలుగా తాడిపత్రిలో సీఐగా విధులు నిర్వర్తిస్తున్న ఆయన ఇటీవల పని ఒత్తిడిపై వారితో మాట్లాడారు. గత మూడు నెలలుగా పని ఒత్తిడితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సీఐ తన భార్య అనురాధతో కూడా గొడవపడగా ఆదివారం రాత్రి కూడా వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.
 
సీఐ ఆనందరావు గత ఏడాది సెప్టెంబర్‌లో కడప నుంచి తాడిపత్రికి బదిలీ అయ్యారు. ఆయన స్వగ్రామం చిత్తూరు జిల్లా చంద్రగిరి. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
 
ఆనందరావు ఆత్మహత్య విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. సీఐ కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పరామర్శించారు.
 
ఎమ్మెల్యే పెద్దారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కుటుంబ కలహాల కారణంగానే సీఐ ఆనందరావు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. ఆత్మహత్యలకు రాజకీయ ఒత్తిళ్లు లేవని, ఆత్మహత్యను రాజకీయం చేయడం మంచిది కాదన్నారు. అవసరమైతే ఘటనపై విచారణ జరిపించాలని ఉన్నతాధికారులను కోరామని తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు