వైకాపా దాడులపై అమిత్ షాకుకు ఏపీ బీజేపీ నేతల ఫిర్యాదు

శుక్రవారం, 13 డిశెంబరు 2019 (10:20 IST)
రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు  చేస్తున్న విపక్షాలపై వైకాపా నేతలు దాడులు చేస్తున్నారని ఏపీ భాజపా నాయకులు ఆరోపించారు. ఈ మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసి వారు ఆధారాలతో సహా లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు. 
 
ప్రతిపక్ష కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడితే సహించబోమని కేంద్రం స్పష్టం చేసింది. ఇకపై అధికార పక్షం ప్రతిపక్ష కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడితే మాత్రం కేంద్రం నుంచి నూతన హోం-శాఖ ప్రధాన కార్యదర్శిని ఏపీలో నియమించి ఎప్పటికప్పుడు సమాచారం స్వీకరించి అధికార పక్షాని నిలదీసే యోచనలో ఉన్నట్టు తెలిపింది. 
 
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును... సీఎం జగన్‌ విమర్శించడం సబబు కాదని భాజపా నేత కిలారు దిలీప్‌, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు రమేష్‌ నాయుడు అన్నారు. తమ ఫిర్యాదుపై అమిత్‌ షా... సానుకూలంగా స్పందించారని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు