2025-26 ఆర్థిక సంవత్సరానికి ఏపీ ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెడుతోంది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. బడ్జెట్లో సంక్షేమ రంగానికి ప్రాధాన్యత ఇచ్చారు. సూపర్ సిక్స్ సహా మేనిఫెస్టోలో హామీల అమలుకు 2025-26 బడ్జెట్లో పెద్ద పీట వేశారు. ఈ ఏడాదిలోనే 25 లక్షలతో ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా పథకం అమలు చేయనున్నారు. ఎన్టీఆర్ వైద్య సేవను కొనసాగిస్తూనే ఆరోగ్య బీమా పథకం అమలు చేయనున్నట్టు బడ్జెట్లో వెల్లడించారు.
అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకు 20 వేలు ఇచ్చేలా కేటాయింపులు చేశారు. తల్లికి వందనం పథకం కింద కుటుంబంలో చదువుకునే ప్రతి విద్యార్థికి 15 వేలు కేటాయించారు. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లల్లో చదివే విద్యార్థులకు తల్లికి వందనం వర్తించనుంది. 1-12వ తరగతుల విద్యార్థులకు తల్లికి వందనం స్కీం వర్తింపు చేశారు. విద్యార్థుల తల్లుల ఖాతాలో తల్లికి వందనం డబ్బులను జమ చేయనున్నారు. స్కూళ్లు తెరిచే నాటికి తల్లికి వందనం పథకం అమలు చేసేలా ప్రణాళికలు చేపట్టారు.
బడ్జెట్ హైలైట్స్
మొత్తం బడ్జెట్ - రూ. 3.22 లక్షల కోట్లు
రెవెన్యూ వ్యయం - రూ. 2,51,162 కోట్లు
మూలధన వ్యయం - రూ. 40,635 కోట్లు
రెవెన్యూ లోటు - రూ. 33,185 కోట్లు
ద్రవ్య లోటు - రూ. 79,926 కోట్లు
ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
చేనేతలకూ ఉచిత విద్యుత్ అమలు
వ్యవసాయానికి - రూ. 48 వేల కోట్లు
పోలవరం ప్రాజెక్టుకు - రూ. 6,705 కోట్లు
అన్నదాత సుఖీభవకు - రూ. 6,300 కోట్లు
పాఠశాల విద్యకు - రూ. 31,805 కోట్లు
ఉన్నత విద్యకు - రూ. 2,506 కోట్లు
నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖకు - రూ. 1,228 కోట్లు
మహిళా శిశు సంక్షేమం, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమం కోసం - రూ. 4,332 కోట్లు
ఆర్ అండ్ బీ కి - రూ. 8,785 కోట్లు
ఇంధన శాఖకు - రూ. 13,600 కోట్లు
తెలుగు భాష అభివృద్ధి, ప్రచారం కోసం - రూ. 10 కోట్లు.