నాన్న జ్ఞాపకాలు ఇంకా అలానే నిలిచివున్నాయి : సీఎం జగన్

శుక్రవారం, 2 సెప్టెంబరు 2022 (10:14 IST)
సెప్టెంబరు రెండో తేదీ.. తన తండ్రి వైఎస్ఆర్ వర్థంతి. దీన్ని పురస్కరించుకుని ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత, వైఎస్ఆర్ తనయుడైన వైఎస్. జగన్మోహన్ రెడ్డి శుక్రవారం ఓ భావోద్వేగ ట్వీట్ చేశారు. "నాన్న భౌతికంగా దూరమైనప్పటికీ ఆ జ్ఞాపకాలు అలానే నిలిచే ఉన్నాయని పేర్కొన్నారు. దేశ చరిత్రలో సంక్షేమాన్ని సరికొత్తగా నిర్వచించారంటూ ట్వీట్ చేశారు. 
 
"నాన్న భౌతికంగా దూరమైనా నేటికీ ఆయన చిరునవ్వు, ఆ జ్ఞాపకాలు అలానే నిలిచివున్నాయి. దేశ చరిత్రలోనే సంక్షేమాన్ని సరికొత్తగా నిర్వహించి, ప్రజల అవసరాలే పాలనకు ప్రధానాంశం కావాలని ఆయన చాటి చెప్పారు. ప్రతి అడుగులోనూ నాన్నే స్ఫూర్తిగా ఇకపై కూడా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తుంది" అని పేర్కొన్నారు. 


 

నాన్న భౌతికంగా దూరమైనా నేటికీ ఆయన చిరునవ్వు, ఆ జ్ఞాపకాలు అలానే నిలిచి ఉన్నాయి. దేశచరిత్రలోనే సంక్షేమాన్ని సరికొత్తగా నిర్వచించి.. ప్రజల అవసరాలే పాలనకు ప్రధానాంశం కావాలని ఆయన చాటిచెప్పారు. ప్రతి అడుగులోనూ నాన్నే స్ఫూర్తిగా ఇకపై కూడా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తుంది.

— YS Jagan Mohan Reddy (@ysjagan) September 2, 2022

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు