జగనన్న సురక్ష 23-25 వరకు నిర్వహించాలి- సీఎం జగన్

బుధవారం, 14 జూన్ 2023 (19:01 IST)
జగనన్న సురక్ష కార్యక్రమం ఈ నెల 23 నుంచి 25 వరకు నిర్వహించాలని ఆదేశించారు.  బుధవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. ప్రజలకు సేవలు అందించడంలో ఉన్నత ప్రమాణాలు పాటించాలని జగన్ ఆదేశించారు. 
 
గ్రీవెన్స్‌ను రిజెక్ట్ చేస్తే ఎందుకు తిరస్కరించారో ఫిర్యాదుదారు ఇంటికెళ్లి వివరించాలని సీఎం కోరారు. ఇళ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. అర్హులుగా గుర్తించిన వారికి ఆగస్ట్ 1 నుంచి పథకాలు మంజూరు చేయాలని జగన్ ఆదేశించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు