డిమాండ్ల సాధన కోసం వచ్చిన టీచర్లు.. క్లాస్ పీకిన మంత్రి బొత్స

మంగళవారం, 26 జులై 2022 (14:59 IST)
తమ డిమాండ్ల పరిష్కారం కోసం సచివాలయానికి తనను కలిసేందుకు వచ్చిన ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులకు ఏపీ విద్యా మంత్రి బొత్స సత్యనారాయణ క్లాస్ పీకారు. రోజూ ఎనిమిది గంటలు పాటు ఎందుకు పని చేయరంటూ నిలదీశారు. ఈ మేరకు సచివాలయంలో తమ డిమాండ్లతో పలు ఉపాధ్యాయ సంఘాల నేతలు కలిసిన సందర్భంగా నిలదీశారు. 
 
ఈ సందర్భంగా ఆయన మరికొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. ఉపాధ్యాయ సంఘాలు బెదిరింపు ధోరణితో డిమాండ్లను సాధించుకునేందుకు యత్నిస్తున్నాయంటూ మండిపడ్డారు. బెదిరిస్తే పనులు జరగవని తేల్చి చెప్పారు. ఉపాధ్యాయ సంఘాలు అనుకున్నవన్నీ కావాలంటే ఎలాగంటూ నిలదీశారు. ఈ సందర్భంగా రోజుకు 8 గంటలు పని చేయాలని ఉపాధ్యాయులకు ఆయన క్లాస్ పీకారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు