ఓబుళాపురం మైనింగ్ తవ్వకాలు.. గాలి జనార్ధన్ రెడ్డికి షాక్

సెల్వి

మంగళవారం, 3 సెప్టెంబరు 2024 (22:10 IST)
గాలి జనార్ధన్ రెడ్డికి ఏపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఏపీ సరిహద్దులో గాలి జనార్ధనరెడ్డి కంపెనీకి మైనింగ్‌ అనుమతి ఇవ్వడానికి తమకు అభ్యంతరం లేదంటూ జగన్ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసిన నేపథ్యంలో.. జగన్ సర్కారు నిర్ణయాన్ని తాము సమీక్షించుకోవాలనుకంటున్నట్లు సుప్రీంకు ఏపీ సర్కారు తెలిపింది. ఈ అభ్యర్థనపై తదుపరి విచారణను కోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది.
 
ఓబుళాపురం మైనింగ్ కంపెనీ తవ్వకాల్లో రాష్ట్ర సరిహద్దులు చేరిగిపోవడంతో గతంలో చేపట్టిన తవ్వకాలను రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది. సర్వే ఆఫ్ ఇండియా నివేదికకు అనుగుణంగా గాలి జనార్ధనరెడ్డి కంపెనీకి మైనింగ్‌కి ఇవ్వడానికి తమకు అభ్యంతరం లేదని గతంలో జగన్ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసిందని మైనింగ్ కంపెనీల న్యాయవాదులు తెలిపారు. 
 
అందరి వాదనలు పరిగణనలోకి తీసుకున్న అనంతరం కేసు విచారణ నాలుగు వారాల పాటు జస్టిస్ హృషీకేశ్ రాయ్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి నేతృత్వంలోని ధర్మాసనం వాయిదా వేసింది. అమికస్ క్యూరీ నివేదికపై కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ధర్మాసనం ఆదేశించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు