దోసెలో బొద్దింక - సింధూర ఈస్ట్ కోర్ట్‌కు షోకాజ్ నోటీసు

సెల్వి

మంగళవారం, 3 సెప్టెంబరు 2024 (18:36 IST)
దోసెలో బొద్దింక వుందనే ఫిర్యాదుతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులు సోమవారం రాఘవేంద్ర నగర్‌లోని సింధూర ఈస్ట్ కోర్టును తనిఖీ చేసి షోకాజ్ నోటీసు జారీ చేశారు. జీహెచ్ఎంసీ ప్రకారం, ఫిర్యాదు అందడంతో తనిఖీలు చేశారు. 
 
ఈ తనిఖీల్లో భాగంగా సరైన పరిశుభ్రత, పారిశుధ్యం, రికార్డుల నిర్వహణ, గడువు ముగిసిన ఆహార పదార్థాలు, రంగుల వాడకాన్ని కనుగొన్నారు. ఇందులో భాగంగా సింధూర ఈస్ట్ కోర్టు యాజమాన్యం వివరణ కోరుతూ షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్ (ఆరోగ్యం) కార్యాలయం తెలిపింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు