ఏపీ ప్రభుత్వ అధికారులకు జైలుశిక్ష విధించిన హైకోర్టు

మంగళవారం, 22 జూన్ 2021 (19:53 IST)
తమ ఆదేశాలను పట్టించుకోని ఇద్దరు ప్రభుత్వ అధికారులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు వారం రోజుల పాటు జైలుశిక్ష విధించింది. గతంలో తాము ఇచ్చిన 36 మంది ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలంటూ ఏప్రిల్‌లో ఇచ్చిన ఆదేశాలను ఏపీ ప్రభుత్వ అధికారులు అరెస్టు చేయలేదు. దీనిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 
 
ఉత్తర్వులు అమలు చేయాలంటూ పలుమార్లు ఆదేశించినప్పటికీ బేఖాతరు చేయడంతో ఐఏఎస్ అధికారి గిరిజా శంకర్, ఐఎఫ్ఎస్ అధికారి చిరంజీవి చౌదరికి కోర్టు వారం రోజులపాటు జైలు శిక్ష విధించింది. 
 
మంగళవారం విచారణకు అధికారులు ఇద్దరు వ్యక్తిగతంతా హాజరయ్యారు. విచారణ సందర్భంగా అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం ఉత్తర్వులను పెడచెవిన పెట్టినందుకు గాను ఇద్దరికీ చెరో వారం రోజులు జైలు శిక్ష విధించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు