రాయలసీమ ప్రాంత భవిష్యత్, గౌరవం కోసం హైకోర్టును తీసుకొచ్చేందుకు పోరాటం జరుగుతుందని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. పైగా, కర్నూలులో ఖచ్చితంగా హైకోర్టును నిర్మిస్తామని ఆయన జోస్యం చెప్పారు. ఈ హైకోర్టు కూడా జగన్నాథ గట్టుపై పది కిలోమీటర్ల దూరం కనిపించేలా నిర్మిస్తామని ఆయన తెలిపారు.
కర్నూలు ఎస్టీబీసీ కళాశాల మైదానంలో వైకాపా ఆధ్వర్యంలో సోమవారం రాయలసీమ గర్జన సభ నిర్వహించారు. ఇందులో రాయలసీమ ప్రాంతానికి చెందిన వైకాపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. సీమ గర్జన సభలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పాల్గొని ప్రసంగిస్తూ, నాడు రాజధానిని కర్నూలు ప్రజలు త్యాగం చేశారని గుర్తు చేశారు. 1956లో కర్నూలు నుంచి రాజధానిని హైదరాబాద్ నగారనికి తరలించారని వివరించరు. అప్పటి నుంచి రాయలసీమ వెనుకబడిపోయిందన్నారు.