రాయ‌ల‌సీమ‌.. కోన‌సీమ‌ భూమికి ప‌చ్చని రంగేసిన‌ట్టు

బుధవారం, 6 జూన్ 2018 (21:44 IST)
దాహ‌మేస్తే.. ఆకాశం వైపు.. ఆక‌లేస్తే భూమి వైపు చూసే రాయ‌ల‌సీమ ధాన్య‌రాశుల సీమ‌గా ద‌ర్శ‌న‌మిస్తోంది. కోన‌సీమ‌ను త‌ల‌పించిన ఈ చిత్రాలు అనంతపురం జిల్లా రాయ‌దుర్గం నియోజకవర్గ పరిధిలోని గుమ్మ‌గుట్ట మండలం కలుగోడు గ్రామంలో ద‌ర్శ‌న‌మిచ్చాయి. 2017లో కురిసిన వ‌ర్షాల‌కు దాదాపు ప‌దేళ్ల‌ త‌రువాత భైర‌వానితిప్ప ప్రాజెక్టుకు నీరొచ్చింది. 
 
53 అడుగుల గ‌రిష్ట నీటిమ‌ట్టానికి చేరుకుంది. దాదాపు 8 నెల‌ల క్రితం ప్రాజెక్టు నుంచి ఆయ‌క‌ట్టుకు నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే, స‌మాచార‌- పౌర‌సంబంధాలు, గ్రామీణ గృహ‌నిర్మాణ శాఖా మంత్రి కాల‌వ శ్రీనివాసులు గేట్లు ఎత్తి నీటిని విడుద‌ల చేశారు. అలాగే నెల‌రోజుల క్రితం గుమ్మ‌గుట్ట మండ‌లంలో మంత్రి కాల‌వ శ్రీనివాసులు ప‌ర్య‌టించిన‌ప్పుడు భూమికీ ప‌చ్చాని రంగేసిన‌ట్టు ఉన్న పంట‌ను త‌న్మ‌య‌త్వంతో ప‌రిశీలించారు. 
 
బుధ‌వారం నాడు గుమ్మ‌గుట్ట మండ‌లంలో క‌లుగోడులో భైర‌వానితిప్ప నీటితో పండిన ధాన్య‌పురాశులను మంత్రి ఆనందంతో చూస్తున్న‌ది. ఈ మూడు చిత్రాలు రాయ‌దుర్గం.. మంత్రి కాల‌వ శ్రీనివాసులు నేతృత్వంలో హ‌రిత‌స్వ‌ర్గంగా మారుతోంద‌ని అనేందుకు సాక్ష్యాలు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు