ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇతర పోకిరీల కంటే... మంత్రుల తనయులు ఆగడాలు మరింతగా శృతిమించిపోతున్నాయి. గతంలో హైదరాబాద్ నగరంలో ఏపీ మంత్రి రావెల కిషోర్ బాబు తనయుడు ఓ ముస్లిం మహిళ చేయి పట్టుకునిలాగినట్టు కేసు దాఖలైంది. ఇపుడు తాజాగా మరో మంత్రి తనయుడు.. పీకల వరకు మద్యం సేవించి లేడీస్ హాస్టల్ వద్ద హల్చల్ సృష్టించాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
అయితే మంత్రి గారి కుమారుడి అరుపులు, కేకలతో అక్కడికి సమీపంలో ఉన్న ఓ బాయ్స్ హాస్టల్కు చెందిన యువకులు అక్కడికి చేరుకుని మంత్రి కుమారడిని అడ్డుకునే యత్నం చేసినట్టు సమాచారం. అయినా వినని మంత్రిగారి పుత్రుడు లేడీస్ హాస్టల్లోకి చొరబడేందుకే యత్నించాడట. దీంతో లాభం లేదని భావించిన ఆ యువకులు నేరుగా పోలీసులకు సమాచారం అందించారు.
వెనువెంటనే రంగంలోకి దిగిన పోలీసులు... మంత్రిగారి పుత్రుడిని చూసి చేసేదేమీ లేక మందలించి ఇంటికి పంపారట. అయితే, ఈ మంత్రి పేరు, ఆయన సుపుత్రుడి పేరును విద్యార్థులు బహిర్గతం చేయలేదు.