తాడేపల్లి తాబేదారుల ఒత్తిడి మేరకే... ఏబీఎన్ రాధాకృష్ణపై తప్పుడు కేసు

సోమవారం, 13 డిశెంబరు 2021 (13:16 IST)
ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణపై ఏపీ సీఐడీ ఎఫ్ ఐఆర్ నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామ‌ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు చెప్పారు. వేమూరి రాధాకృష్ణ ఏం నేరం చేశారని ఎఫ్ ఐఆర్ నమోదు చేశార‌ని ప్ర‌శ్నించారు. తన అవినీతి బురదను అందరికీ అంటించేందుకు జగన్ రెడ్డి ప్రయత్నిస్తున్నార‌ని, తన మిత్రుడు, రిటైర్డ్ ఐఏఎస్ లక్ష్మీ నారాయణ నివాసంపై సోదాలకు వెళితే, అక్కడికి రావడం రాధాకృష్ణ చేసిన తప్పా? లక్షీనారాయణతో సీఐడీ అధికారుల సమక్షంలోనే రాధాకృష్ణ మాట్లాడినా, ఎందుకు ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు? అని నిల‌దీశారు. 
 
 
తాడేపల్లి తాబేదారుల నుంచి నుంచి వచ్చిన ఆదేశాలతోనే అక్రమ కేసు పెట్టార‌ని, దాదాపు 30 గంటల తర్వాత  జీరో ఎప్.ఐ.ఆర్ నమోదు చేయటం ప్రభుత్వ కుట్రలకు నిదర్శనమ‌న్నారు.  జీరో ఎప్.ఐర్ నమోదు చేయాల్సి ప్రభుత్వ వైఫల్యాల్ని, తప్పుల్ని ఎత్తిచూపుతున్న ‎ వారిపై కాదు, తప్పులు చేసి తప్పించుకు తిరుగుతున్న జగన్ రెడ్డి పైనే జీరో ఎ.ఫ్.ఐ.ర్ లు నమోదు చేయాల‌ని డిమాండు చేశారు.  జగన్ చేసిన తప్పులకు, అవినీతికి జీరో ఎప్.ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేస్తే,  రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్నిపోలీస్ స్టేషన్లలో ఎప్.ఐఆర్ పుస్తకాలన్నీ నిండిపో‎తాయ‌ని ఎద్దేవా చేశారు.
 
 
రాష్ట్రంలో అవినీతి సాక్షి తప్పించి మరో మీడియా ఉండేందుకు వీల్లేదన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడటం హేయం అని అచ్చెన్నాయుడు అన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్న మీడియాకు ఎన్నాళ్లు సంకెళ్లు వేస్తారు?  జగన్ రెడ్డి చేస్తున్న ప్రతి తప్పు వైసీపీ పాలనకు ముప్పుగా మారుతుంద‌ని పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు