కాళ్లు పట్టుకోవడం.. పాదాలు పిసకడం అంటే ఇదీ... : విజయసాయికి కౌంటర్ ఇచ్చిన్న అయ్యన్న

శుక్రవారం, 13 అక్టోబరు 2023 (12:10 IST)
కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై వైపాకా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. హోం మంత్రి అమిత్ షాను కలిసేందుకు ఎంత మంది కాళ్లు పట్టుకున్నావంటూ ప్రశ్నించారు. దీనికి టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సరైన రీతిలో కౌంటర్ ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ కాళ్లను వైకాపా అధినేత, ఏపీ సీఎం జగన్ పట్టుకున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసి.. కాళ్లు పట్టుకోవడం అంటే అంటూ ట్వీట్ చేశారు. పైగా, ఈ ఫోటోతో పాటు పట్టిన కాళ్లు, పిసికిన పాదాలు గుర్తుకు వచ్చాయా అని ప్రశ్నించారు. 
 
ఎక్స్ వేదికగా విజయసాయిరెడ్డిపై అయ్యన్నపాత్రుడు చెలరేగిపోయాడు. ప్రధాని మోడీ కాళ్లను జగన్ పట్టుకున్న ఫోటోను షేర్ చేసిన అయ్యన్నపాత్రుడు... "బాబాయ్‌ని వేసేసిన అబ్బాయిని తప్పించేందుకు ఢిల్లీ వెళ్లి అపాయింట్మెంట్లు ఇప్పించేందుకు పట్టిన కాళ్లు, పిసికిన పాదాలు గుర్తొచ్చాయా? అని ప్రశ్నించారు. కన్నింగ్ పనులు చేయడం, కాళ్లు పట్టడం అలవాటైన ఏ1, ఏ2 ప్రాణాలకు ఎవరు పిలిచినా.. ఎవరు కలిసినా అలాగే, కనిపిస్తుంది కదా కసాయి రెడ్డీ" అని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

 

ఏ2 గారూ, దీనిని కాళ్లు ప‌ట్టుకోవ‌డం అంటారు. బాబాయ్‌ని వేసేసిన అబ్బాయిని త‌ప్పించేందుకు ఢిల్లీ వెళ్లి నువ్వు అపాయింట్మెంట్లు ఇప్పించేందుకు మ‌ళ్లీ మ‌ళ్లీ నువ్వు ప‌ట్టిన కాళ్లు, నువ్వు పిసికిన పాదాలు గుర్తుకొచ్చాయా! క‌న్నింగ్ ప‌నులు చేయ‌డం, కాళ్లు ప‌ట్ట‌డం అల‌వాటైన ఏ1,ఏ2 ప్రాణాల‌కి… https://t.co/ZPEqV4gD6g pic.twitter.com/s1tMOlupVQ

— Ayyanna Patrudu (@AyyannaPatruduC) October 13, 2023

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు