కృష్ణా జిల్లా గన్నవరంలో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో గత వైకాపా ప్రభుత్వంలో జరిగిన దాడి కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ దాడి జరిగినట్టు పోలీసులకు ఫిర్యాదు చేసిన వ్యక్తి ఇపుడు యూ టర్న్ తీసుకున్నాడు. తాను పోలీసులకు ఫిర్యాదు చేయలేదని, పోలీసులే తనపై బలవంతంగా సంతకం చేయించి, కేసు నమోదు చేశారంటూ వాగ్మూలంతో కూడిన అఫిడవిట్ను కోర్టుకు సమర్పించాడు. పైగా, ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, అందువల్ల పోలీసుల నుంచి తనకు రక్షణ కల్పించాలని కోర్టును ప్రాధేయపడ్డాడు. దీంతో ఈ కేసుపై మంగళవారం మరోమారు విచారణ జరుగనుంది.