అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు.. పెళ్ళి కూడా ఫిక్స్... బట్టలు తెచ్చుకుంటానని వరుడు?

శుక్రవారం, 14 జులై 2017 (10:00 IST)
అవును వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు.. పెద్దలను కూడా ఒప్పించారు. అయితే ముహూర్తం సమయానికి పెళ్ళి కొడుకు కనిపించలేదు. ఈ ఘటన కర్నూలు జిల్లా.. మంత్రాలయంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మంత్రాలయం మండలంలోని ఓ గ్రామానికి చెందిన అమ్మాయిని డిగ్రీ రెండో సంవత్సరం ఈరన్న, ఉసేనమ్మల కొడుకు లక్ష్మప్ప ప్రేమించాడు. వీరి ప్రేమకు పెద్దలు కూడా అంగీకరించడంతో.. నాలుగు రోజుల క్రితం నిశ్చితార్థం చేశారు. 
 
ఆపై గురువారం ముహూర్తం ఖరారు చేశారు. బుధవారం లక్ష్మప్ప కొత్త బట్టలు తెచ్చుకుంటానని పెళ్లి కూతురు తల్లిదండ్రుల దగ్గర రూ.పదివేలు తీసుకొని వెళ్లి రాత్రి వరకు ఇంటికి చేరుకోలేదు. ముహూర్తం దగ్గరపడుతున్నా.. రాకపోవడంతో పెళ్లి కూతురు తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై పెళ్ళి కూతురు తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో..  బాధితురాలికి న్యాయం చేస్తామని మంత్రాలయం ఎస్‌ఐ శ్రీనివాసనాయక్‌ హామీ ఇచ్చారు. లక్ష్మప్ప కోసం గాలిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి