చంద్రబాబు ఏం చెబితే సీబీఐ అదే చెబుతుంది: పేర్ని నాని పాత వీడియో వైరల్

ఐవీఆర్

శుక్రవారం, 4 అక్టోబరు 2024 (14:10 IST)
తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టు సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో స్వతంత్ర ప్రత్యేక దర్యాప్తు సంస్థ - సిట్‌తో విచారణ జరిపించాలని కోర్టు ఆదేశించింది.  సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో దర్యాప్తు సంస్థలో ఐదుగురు సభ్యులు ఉండాలని తెలిపింది. ఇందులో సీబీఐ నుంచి ఇద్దరు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరో ఇద్దరితో పాటు ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి ఒక నిపుణుడు ఉండాలని న్యాయమూర్తులు తమ ఆదేశాల్లో పేర్కొన్నారు.
 
ఈ నేపధ్యంలో వైసిపి నాయకులు గతంలో చేసిన వ్యాఖ్యలతో కూడిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో వారంతా సీబీఐ పైన తమకు నమ్మకం లేదనీ, చంద్రబాబు నాయుడు ఏది చెబితే సీబీఐ కూడా అదే చెబుతుందని ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా పేర్ని నాని మాట్లాడుతూ... చంద్రబాబు చేతుల్లో కీలుబొమ్మలాంటి వారు సీబీఐలో వున్నారంటూ వ్యాఖ్యానించారు. చూడండి ఆ వీడియోను...

పాపం.. బులుగు గొర్రెలు...
ఇప్పుడు సిబిఐని పొగడాలా ? తిట్టాలా అనేది నీ గొర్రెలకు చెప్పు @ysjagan#NeePaapamPandindiJagan#YCPAnimalFatInTirumalaLaddu#FekuJagan#Tirumala#TirumalaLaddu#AndhraPradesh pic.twitter.com/mtgSkgz9x5

— Telugu Desam Party (@JaiTDP) October 4, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు