ఈ ఏడాది 12 లక్షల మెట్రిక్ టన్నుల మిర్చిని కొనుగోలు చేయాల్సి ఉందని, ఇప్పటివరకు నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశామని చంద్రబాబు తెలిపారు. ప్రస్తుతం ఉన్న అన్ని సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని, శుక్రవారం అధికారులతో సమావేశం నిర్వహించిన తర్వాత స్పష్టత ఇస్తానని కేంద్ర మంత్రి చెప్పారు.