ఎప్పటి నుంచో ఢిల్లీ మెట్రోను చూడాలనుకున్నట్లు చెప్పారు. మెట్రోతో సమయం ఆదా, పొల్యూషన్ ఉండదని బాబు తెలిపారు. దేశంలో అధిక జనాభా దృష్ట్యా మరిన్ని మెట్రోలు రావాలని చంద్రబాబు ఆకాంక్షించారు. విశాఖ, విజయవాడల్లో అత్యున్నత ప్రమాణాలతో మెట్రో ప్రాజెక్టును తీసుకువస్తామన్నారు. అందుకోసం ప్రపంచంలోని అగ్రశ్రేణి నగరాలలో మెట్రోలను పరిశీలిస్తామని, ఢిల్లీ మెట్రోను కూడా మరోసారి పరిశీలిస్తామని చంద్రబాబు వెల్లడించారు.