పేద ప్రజల సొంతింటి కల అలా నెరేవురుతోంది.. ఇళ్ల పట్టాల పంపిణీ పండుగ

శుక్రవారం, 26 మే 2023 (11:38 IST)
అమరావతి ప్రాంతంలో పేద ప్రజల సొంతింటి కల నెరవేరనుంది. ఈ మేరకు సీఎం జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం పట్టాలు పంపిణీ చేయనున్నారు. వెంకటపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు పక్కన ఉన్న వేంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గర భారీ బహిరంగ సభ ఏర్పాట్లు పూర్తయ్యాయి. 
 
ఈ సభకు 50 వేల మంది లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు కలిపి మొత్తంగా సుమారు రెండు లక్షల మంది వస్తారని అధికార యంత్రాంగం అంచనా వేస్తోంది. 
 
ఇందుకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. సీఆర్డీఏ పరిధిలోని ఆర్-5 జోన్‌లో 50,793 మంది మహిళలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభిస్తారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు