జ్యోతిష్యుడిని హత్య చేసిన భార్యాభర్తలు.. కత్తితో పొడిచి పెట్రోల్ పోసి కాల్చేశారు..

సెల్వి

శుక్రవారం, 21 ఫిబ్రవరి 2025 (16:21 IST)
విశాఖకు చెందిన ఓ వ్యక్తి ఓ జ్యోతిష్యుడిని హత్య చేశాడు. అంతా తన భార్య కోసమే ఆతనిని హతమార్చినట్లు పోలీసుల విచారణలో తెలిపాడు. తన భార్య పట్ల అనుచితంగా ప్రవర్తించిన కారణంగా అతడిని హత్య చేశాడు. ఇంకా ఎలాంటి ఆనవాళ్లు దొరక్కుండా వుండేందుకు పెట్రోల్ పోసి తగలబెట్టేశాడు. 
 
ఈ ఘటన విశాఖలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. భీమిలి మండలం నేర్లవలస గ్రామానికి చెందిన ఊళ్ల చిన్నారావు, మౌనిక దంపతులు ఆనంద పురం మండలం లొడగలవానిపాలెంలో నివాసముంటున్నారు. జ్యోతిషుడు అప్పన్న (50) గురించి తెలుసుకున్న మౌనిక ఈ నెల 7న పూజల కోసం ఆయన్ను ఇంటికి పిలిచింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అప్పన్న ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. 
 
ఈ విషయాన్ని ఆమె భర్తకు చెప్పింది. అతను అప్పన్నను పక్కా ప్లాన్ చేసి హతమార్చాడు. పూజ కోసం అని అప్పన్నను భార్యాభర్తలిద్దరూ తీసుకెళ్లి కత్తితో పొడిచి.. చనిపోయాక పెట్రోల్ పోసి కాల్చేశారు. ఈ నెల 19న కల్లివానిపాలెం వద్ద అస్థిపంజరం లభించడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చిన్నారావు దంపతులపై అనుమానం వచ్చి, విచారించగా వాస్తవాలు వెలుగు చూశాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు