ఏపీలో కేసులు తగ్గినా.. మృతుల సంఖ్య తగ్గలేదే...!

గురువారం, 27 మే 2021 (19:36 IST)
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నట్లే కనిపిస్తోంది. కానీ మరణాల సంఖ్య మాత్రం ఆందోళన కలిగిస్తోంది. ప్రతి రోజు 90 నుంచి 100 మంది మరణిస్తున్నారు. తాజాగా..24 గంటల 16 వేల 167 మందికి కరోనా సోకింది. 104 మంది చనిపోయారు. ఈ మేరకు ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో వెల్లడించింది. చిత్తూరు జిల్లాలో 14 మంది మృత్యువాత పడ్డారు. 
 
పశ్చిమ గోదావరిలో 13 మంది చనిపోయారు. చిత్తూరు జిల్లాలో 2 వేల 967 కేసులు నమోదయ్యాయి. తూర్పు గోదావరి జిల్లాలో 2 వేల 325 కేసులు రికార్డయ్యాయి. గడిచిన 24 గంటల్లో 21 వేల 385 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. నేటి వరకు రాష్ట్రంలో 1,89,24,545 శాంపిల్స్ పరీక్షించారు.
 
జిల్లాల వారీగా మృతుల వివరాలు :
చిత్తూరులో 14 మంది, పశ్చిమ గోదావరిలో 13 మంది, విశాఖలో 11 మంది, అనంతపూర్ లో 9 మంది, నెల్లూరులో తొమ్మిది మంది, గుంటూరులో ఎనిమిది మంది, విజయనగరంలో ఎనిమిది మంది, ప్రకాశంలో ఏడుగురు, తూర్పు గోదావరిలో ఆరుగురు, కృష్ణాలో ఆరుగురు, కర్నూలులో ఆరుగురు, శ్రీకాకుళంలో ఆరుగురు, వైఎస్ఆర్ కడపలో ఒక్కరు మరణించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు