కరోనా వైరస్ ఎఫెక్ట్.. 18.5 లక్షల అబార్షన్‌లు.. అదీ గైనకాలజిస్టులు లేకుండానే?

శనివారం, 13 జూన్ 2020 (13:39 IST)
కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనాకు మాత్రమే వైద్యులకు చికిత్స ఇచ్చేందుకు  సమయం సరిపోతుందని.. ఫలితంగా లాక్‌డౌన్‌ కాలంలో దేశవ్యాప్తంగా 18.5 లక్షల అబార్షన్‌లు గైనకాలజిస్ట్‌ సలహా లేకుండానే జరిగాయని సర్వేలు వెల్లడిస్తున్నాయి. 
 
మహిళలల్లో సురక్షిత, చట్టబద్ధమైన అబార్షన్ల గురించి అవగాహన కల్పించే ఐపాస్‌ డెవలప్‌మెంట్‌ ఫౌండేషన్‌ (ఐడీఎఫ్‌) ఈ సర్వేను నిర్వహించింది. లాక్‌డౌన్‌ మొదటి మూడు దశల్లో మహిళలకు అందిన వైద్య సౌకర్యాలపై ఈ సర్వే దృష్టి పెట్టింది. 
 
లాక్‌డౌన్‌ 1, 2 దశల్లో అంటే మార్చి 25 నుంచి మే 3 వరకు 59 శాతం మహిళలకు అబార్షన్‌ అంశంలో ఆస్పత్రికి వెళ్లడం, వైద్యులను కలవడం వంటి సదుపాయాలు లభించలేదని తెలిపింది. అన్‌లాక్‌ దశలో ఈ  పరిస్థితిలో మార్పు వచ్చిందని.. ఈ సంఖ్య 33 శాతానికి పడిపోయిందని సర్వే తెలిపింది. 
 
ఈ క్రమంలో ఐడీఎఫ్‌ సీఈఓ వినోజ్ మానింగ్ మాట్లాడుతూ.. కరోనా మహమ్మారిగా మారినందున వైద్య సిబ్బంది పూర్తి శ్రద్ధ, కృషి వైరస్ నియంత్రణ మీదనే ఉంది. ఫలితంగా మిగతా వైద్య సేవలు, ముఖ్యంగా సురక్షితమైన గర్భస్రావం వంటి సేవలకు అంతరాయం కలిగింది. మెజారిటీ ప్రజారోగ్య సౌకర్యాలు, వైద్య సిబ్బంది కోవిడ్‌-19 చికిత్సలపై దృష్టి సారించారని చెప్పారు. 
 
ప్రైవేట్ ఆస్పత్రులు మూసివేయడంతో సురక్షితమైన గర్భస్రావానికి ఇబ్బందులు ఎదురయ్యాయని తెలిపారు. మరోవైపు ప్రైవేట్ ఆస్పత్రులు మూసివేశారు. దాంతో సురక్షితమైన గర్భస్రావం పొందడంలో ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పుకొచ్చారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు