భారత్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున బెట్టింగులు జరిగాయి. లక్షల మొత్తంలో చేతులు మారాయి. భారత జట్టుపై ఎక్కువ ఆశలు పెట్టుకుని పూర్తిగా నష్టపోయిన వారు ఎందరో ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో పోలీసులు ఓ ముఠా నిర్వహిస్తున్న బెట్టింగు కార్యక్రమాన్ని బట్టబయలు చేసింది.