ఇక్కడ శత్రువు ఎక్కడో లేడంటున్న రాజమౌళి (వీడియో)

శుక్రవారం, 22 డిశెంబరు 2017 (12:42 IST)
హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీసులు రోడ్డు ప్రమాదాలపై ఓ అవగాహనా కార్యక్రమం ఇటీవల నిర్వహించారు. ఇందులో మెగా ఫ్యామీలీ హీరో అల్లు అర్జున్‌తో పాటు దర్శక దిగ్గజం ఎస్.ఎస్.రాజమౌళిలు పాల్గొని యువతకు తమ అమూల్యమైన సందేశాన్ని ఇచ్చాడు. 
 
ముఖ్యంగా, రోడ్డు ప్రమాదాలకు కారణం ఎవరో కాదనీ, ఆ మరణాలకు మనమే కారణమంటూ వ్యాఖ్యానించారు. అంటే ప్రమాదాలకు శత్రువు ఎక్కడో లేడనీ, ఇక్కడే ఉన్నాడంటూ చెప్పుకొచ్చాడు. దేశ వ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో దాదాపు 1.50 లక్షల మంది చనిపోతున్నారనీ, ఈ మరణాలకు వాహనం డ్రైవ్ చేసేసమయంలో మనం చేసే చిన్నపొరపాట్లేనని చెప్పారు. కాగా, రాజమౌళి ప్రసంగానికి సంబంధించిన వీడియోను మీరూ చూడండి.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు