కాగా, కింగ్ డమ్ సినిమాకు ప్రీమియర్ షోలకు టికెట్ల పెంపు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రబుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. కేవలం 31 నుంచి పెంచుకునేట్లు జీవో విడుదలచేసింది. దానితో నిర్మాత సందిగ్థంలో వున్నారు. ఇక తెలంగాణ ప్రభుత్వం పూర్తి పర్మిషన్ ఇచ్చింది. తెలంగాణ నటుడు కాబట్టి టికెట్ల రేట్లపెంపు పెద్ద సమస్యగా వుండబోదు. గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తున్న ఈ యాక్షన్ డ్రామాలో విజయ్ సరికొత్త గెటప్తో ప్రేక్షకులను థ్రిల్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమాలో అన్నదమ్ముల సెంటిమెంట్ ప్రేక్షకులను కట్టిపడేయడం ఖాయమని చిత్ర యూనిట్ చెబుతోంది. భాగ్యశ్రీ బోర్సె హీరోయిన్గా నటిస్తోండగా సత్యదేవ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.