విజయవాడ : చెడుపై మంచి సాధించిన విజయంగా దీపావళిని నేతలు వర్ణిస్తుంటారు. పైగా నరకాసురుడి వధను నరక చతుర్థినాడు నిర్వహిస్తుంటారు. నవ్యాంధ్రప్రదేశ్లో తొలిసారి నరకాసుర వధను ఏపీ ప్రభుత్వం ఓ కార్యక్రమంగా చేపట్టింది. కృష్ణా పుష్కరాలకు అభివృద్ధి చేసిన ఇబ్రహీంపట్నం ఫెర్రీ ఘాట్ వద్ద ఇందుకు ఏర్పాట్టు చేశారు.