హైదరాబాద్, కాలాపత్తర్ మిస్రీగంజ్ పూల్బాగ్కు చెందిన అర్షియాబేగం(30) మల్లేపల్లికి చెందిన డాక్టర్ సయ్యద్ మిరాజుద్దీన్(45)ను ఈనెల 19న వివాహం చేసుకున్నారు. వాస్తవానికి డాక్టర్కు ఇది మూడో పెళ్లి. తన బావ మళ్లీ వివాహం చేసుకోవడం ద్వారా అక్కకు అన్యాయం జరిగిందని మిరాజుద్దీన్ రెండో భార్య సోదరుడు అజీముద్దీన్ కక్ష పెంచుకున్నాడు.
ఈనెల 21న రాత్రి మల్లేపల్లిలో ఉన్న ‘మిరాజ్ కార్డియో క్లినిక్ అండ్ లైఫ్ కేర్ సెంటర్’కు వెళ్లి మిరాజుద్దీన్ను డాక్టర్తో గొడవపడ్డాడు. దీంతో ఆగ్రహానికి గురైన మిరాజుద్దీన్... డాక్టర్ను గొంతు కోసి హతమార్చాడు. ఈ విషయం అర్షియాబేగంకు తెలిసింది. తన భర్త మరణాన్ని తట్టుకోలేని ఆమె గురువారం ఉదయం నమాజ్ చేసిన అనంతరం తన గదిలోకి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.