విశాఖ‌లో ఈనెల 19న డ్రాగన్ ఫోర్స్ కరాటే కప్

శుక్రవారం, 17 డిశెంబరు 2021 (16:03 IST)
విశాఖపట్నంలో డ్రాగన్ ఫోర్స్ 25 ఇయర్స్ సెలబ్రేషన్స్, కరాటే కప్ ని విశాఖ నగర మేయర్ గోలగాని హరి వెంకట కుమారి ఆవిష్క‌రించారు.


ఈ కార్య‌క్ర‌మంలో వైసీపీ మహిళా నాయకురాలు పేడాడ  రమణికుమారి,  బాణాల శ్రీనివాసరావు, వైఎస్సార్సీపీ  కార్పొరేటర్, డ్రాగన్ ఫోర్స్ ఫౌండర్ చిగురుపల్లి సతీష్ కుమార్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ వ‌డోకాయ్ డు కరాటే అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కే శివ గణేష్, సౌత్ ఇండియా అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ఏ. కిషోర్, విశాఖపట్నం, వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్ .శ్రీను కూడా హాజ‌ర‌య్యారు.


ఈ నెల 19వ తేదీన డ్రాగన్ ఫోర్స్ 25 ఇయర్స్ సెలబ్రేషన్స్ కరాటే పోటీలు, ఎఫ్సిఐ కాలనీ( ఆపిల్ పార్క్) భాస్కర్ గార్డెన్స్, మర్రిపాలెంలో జరుగుతాయ‌ని సి.హెచ్ సతీష్ కుమార్ తెలియజేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు