ప్లాస్టిక్ బ్యాగుల తయారీ కంపెనీలో అగ్నిప్రమాదం

శుక్రవారం, 3 సెప్టెంబరు 2021 (10:58 IST)
కృష్ణా జిల్లాలోని ఓ ప్లాస్టిక్ సంచుల తయారీ పరిశ్రమలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. గన్నవరం మండలం తెంపల్లి రైల్వే గేట్ సమీపంలోని శ్రీవిద్య పాలిమర్స్ కంపెనీలో ఈ తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. 
 
సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది అతి కష్టం మీద మంటలను అదుపు చేయగలిగారు. ఈ ఘటనలో భారీ ఆస్తినష్టం సంభవించి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు