ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి

గురువారం, 24 మార్చి 2022 (18:25 IST)
ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఏపీ ప్రకాశం, యర్రగొండపాలెం మండలం కొత్తపల్లి రహదారిపై కారు, ఆటో ఢీకొంది. ఈ ఘటనలో నలుగురు తీవ్రగాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 
 
ఈ ఘటనలో 10 మందికి తీవ్రగాయాలు కాగా వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. మృతులు మొగుళ్లపల్లికి చెందిన కూలీలుగా గుర్తించారు. 
 
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహయ కార్యక్రమాలు చేపట్టారు. ప్రమాదానికి గత కారణాలను బాధితుల నుంచి అడిగి తెలుసుకుంటున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు