సర్వే చట్ట విరుద్ధమంటూ సుప్రీం కోర్టు న్యాయవాది పీవీ కృష్ణయ్య దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఇప్పటికే సర్వేకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు పూర్తి వివరాలు ఇచ్చిందని, సమగ్ర సర్వే నిర్వహిస్తున్నది కేవలం లబ్దిదారులను గుర్తించేందుకేనని ప్రభుత్వం కోర్టుకు స్పష్టం చేసింది.