దీనిపై కేసు నమోదు చేసిన విజయవాడ పట్టణ పోలీసులు ఆరుగురు అనుమానితులను అరెస్టు చేసి, వారిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే, ఈ ఆరుగురిని కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ప్రాసిక్యూషన్ నేరం రుజువు చేయలేకపోయిందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
ఈ కేసు విచారణ సందర్భంగా హత్యకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని, ఈ కేసులో పోలీసులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. సరైన ఆధారాలు లేని కారణంగా నిందితులకు శిక్ష విధించలేమని ధర్మాసనం స్పష్టంచేసింది. ఈ కేసులో పోలీసులు అనుసరించిన వైఖరిపై అపుడే విమర్శలు వస్తున్నాయి.