17 నుంచి తిరుపతి - హుబ్లీ ప్యాసింజర్ రైళ్లు పునరుద్ధరణ

శుక్రవారం, 14 అక్టోబరు 2022 (10:24 IST)
ఈ నెల 17వ తేదీ నుంచి హుబ్లీ - తిరుపతి - హుబ్లీ ప్రాంతాల మధ్య నడిచే ప్యాసింజర్ రైళ్లను పునరుద్ధరించనున్నారు. ఈ విషయాన్ని రైల్వే అధికారులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. 
 
07657 నెంబరుతో నడిచే రైలు ఈనెల 17వ తేదీన తిరుపతిలో ఉదయం 6-10 గంటలకు బయలుదేరి, మధ్యాహ్నం 1-10 గంటలకు గుంతకల్లుకు వచ్చి, రాత్రి 9-10 గంటలకు హుబ్లీకి చేరుకుంటుందని తెలిపారు. 
 
అలాగే, తిరుగు ప్రయాణంలో 07668 నెంబరుతో నడిచే రైలు ఈ నెల 18వ తేదీన హుబ్లీలో ఉదయం 6 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12-55 గంటలకు గుంతకల్లుకు వచ్చి, రాత్రి 9-50 గంటలకు తిరుపతికి చేరుతుందని పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు